హైదరాబాద్: 28°C
క్రైమ్

మ్యాన్ హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఎమ్మెల్యే ఆరా

TG: HYDలోని మియాపూర్‌లో విషాదం నెలకొంది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు అయ్యాడు. వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన బాలయ్యగా గుర్తించారు. హైడ్రా, NDRF బృందాలు గాలింపు చేపట్టాయి. గల్లంతైన వ్యక్తి కోసం ముమ్మరంగా గాలింపు చేయాలని MLA ఆరికెపూడి గాంధీ తెలిపారు.