హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒలింపిక్స్ వరకు మిఠాయిలు బంద్: సవిత

ఒలింపిక్స్-2028 వరకు మిఠాయిలు, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్ తినకూడదని నిర్ణయించుకున్నట్లు భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవిత పునియా తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు డైట్ నుంచి చక్కెర, జంక్ ఫుడ్‌ను తప్పించామని చెప్పింది. దీంతో ఫిట్‌నెస్ స్థాయిలో స్పష్టమైన మార్పు కనిపించినట్లు ఆమె పేర్కొంది. ఆధునిక హాకీలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యమని చెప్పింది.