హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత్‌కు మరో స్వర్ణం

గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ మరో స్వర్ణ పతకం సాధించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఇషా సింగ్ స్వర్ణంతో మెరిసింది. అలాగే, మనూ బాకర్‌కి కాంస్యం లభించింది. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణ పతకం చేరింది. కాగా, మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన సంగతి తెలిసిందే.