ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. ఫిట్నెస్ సాధిస్తే రెండో టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. గాయాల బారిన పడిన నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా రెండు టెస్టుల సిరీస్కు జట్టులో ఉండే ఛాన్స్ లేదు. శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న గాలెలో మొదలవుతుంది.
క్రీడలు
శ్రీలంకతో తొలి టెస్టుకు సుందర్ దూరం


