హైదరాబాద్: 28°C
క్రీడలు

ZIM vs IND: సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్

జింబాబ్వేతో జరిగిన ఆఖరి టీ20లో భారత్‌ 35 పరుగుల తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, యశ్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.