హైదరాబాద్: 28°C
క్రైమ్

ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

హిమచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ట్యాక్సీపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మృతిచెందారు. ఉదయ్‌పూర్-కిల్లార్ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కులు నుంచి పాంగీ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.