హైదరాబాద్: 28°C
క్రీడలు

డీఎస్పీలుగా భారత క్రికెటర్లు

టీమిండియా ఫాస్ట్ బౌలర్లు ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్‌లకు బీహార్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినందుకుగానూ.. పాట్నాలోని 'ఎనర్జీ ఆడిటోరియం'లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరికీ సీఎం నియామక పత్రాలు అందజేసి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా నియమించారు.