హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రత్యేక జెర్సీలో మెరిసిన సికందర్ సేన

భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రెట్రో జెర్సీలో దర్శనమివ్వడం అభిమానులను ఆకట్టుకుంది. తమ క్రికెట్ చరిత్రకు నివాళిగా 1992 వన్డే ప్రపంచకప్‌లో ధరించిన ఐకానిక్ ఎరుపు రంగు కిట్‌ను ZIM క్రికెట్ బోర్డు ఈ సిరీస్ కోసం తిరిగి తీసుకొచ్చింది. నాటి చిరస్మరణీయ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆటగాళ్లు ఈ ప్రత్యేక జెర్సీతో మైదానంలోకి దిగారు.