హైదరాబాద్: 28°C
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్.. భారత్‌కు తొలి పతకం

స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. బాక్సింగ్‌ మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌కు క్వార్టర్ ఫైనల్స్‌లో 'బై' లభించడంతో నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. దీనితో భారత్‌కు కనీసం కాంస్య పతకం దక్కింది. జులై 31న సెమీఫైనల్ మ్యాచ్‌ జరగనుంది.