హైదరాబాద్: 28°C
వ్యాపారం

5,000mah బ్యాటరీతో శాంసంగ్ Z ఫోల్డ్ 8 అల్ట్రా

మొబైల్‌ తయారీ సంస్థ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా పేరిట స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. ఈ ఫోన్ 8 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ మెయిన్ డిస్ ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జన్ 5 ప్రాసెసర్, 5,000mah బ్యాటరీ, 200MP+ 50MP+ 10MP వెనుక కెమెరా, 10MP+ 10MP సెల్ఫీ కెమెరాలతో వస్తోంది. 12GB + 256GB వేరియంట్ ధరను రూ.1,99,999గా కంపెనీ నిర్ణయించింది.