ఇటీవల కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ఐపీఎల్ తర్వాత ఇవన్నీ సహజమేనని, బెంచ్పై కూర్చున్నప్పుడు నిరాశ కలిగినా ప్రాక్టీస్ ఆపలేదని చెప్పాడు. జట్టు సహకారంతో మళ్లీ అవకాశం వచ్చినప్పుడు వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని వైభవ్ ధీమా వ్యక్తం చేశాడు.
క్రీడలు
'ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నా'


