NZB: ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట్ పాఠశాల 1998-99 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. 27 ఏళ్ల తర్వాత ఇలా అందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉందని, ఆటపాటలతో రోజంతా ఆనందంగా గడిపినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.
వార్తలు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం


