ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ 53 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆదిల్ రషీద్ వేసిన 15వ ఓవర్లో ఫోర్, రెండు పరుగులు తీసి గిల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 89/0 స్కోరుతో నిలవగా.. రోహిత్ శర్మ (36), గిల్ (52) క్రీజులో ఉన్నారు.
క్రీడలు
శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీ


