హైదరాబాద్: 28°C
క్రైమ్

ట్రేడింగ్ యాప్‌తో రూ.3 కోట్లు టోకరా

TG: నకిలీ ట్రేడింగ్ యాప్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా హైదారాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి రూ.3 కోట్లు మోసపోయాడు. ఫేస్ బుక్ ప్రకటన చూసి పెట్టుబడి పెట్టాడు. ఇది అదునుగా సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్‌సైట్‌తో భారీ లాభాలను చూపిస్తూ.. దోచుకున్నారు. అనంతరం బాధితుడు నగదును విత్‌డ్రా చేసేందుకు యత్నించగా.. రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.