హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫైనల్‌కు దూసుకెళ్లిన సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు జపాన్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో చైనాకు చెందిన చెన్ యుఫెయ్ గాయంతో తప్పుకోవడంతో సింధు విజేతగా నిలిచింది. ఈ టోర్నీ ఫైనల్ చేరిన తొలి భారత ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో జపాన్ క్రీడాకారిణి యమగూచితో సింధు తలపడనుంది.