హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలి వన్డేలో నిరాశపరిచిన రో-కో జోడి

ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ స్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ 11 పరుగులు చేయగా, కోహ్లీ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. రేపు జరగబోయే రెండో వన్డేలోనైనా ఈ ఇద్దరు ఆటగాళ్లు రాణించి చెలరేగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.