హైదరాబాద్: 28°C
వ్యాపారం

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

Advertisement

TG: కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. జూన్ నెలాఖరు వచ్చినా వాన జాడ లేకపోవడంతో కూరగాయల సాగు భారీగా తగ్గిపోయింది. దీంతో రేట్లకు రెక్కలు వచ్చాయి. బీన్స్ రైతు బజార్‍లో కేజీ రూ. 100 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.150- రూ.180 పలుకుతుంది. చిక్కుడుకాయ రైతు బజార్‍లో రూ.70 నుంచి రూ.80 ఉండగా, బయట మార్కెట్‌లో రూ.150 వరకూ అమ్ముడవుతోంది. మిర్చి కిలో రూ.80కి చేరింది.

Advertisement

Advertisement