TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మెట్ల మార్గంలో భక్తులు కిక్కిరిసిపోయారు. మోకాళ్లపై నడుస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో హైదరాబాద్ నగరవాసులతో పాటు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీనీ దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు అన్ని వసతులు కల్పించారు.
భక్తి
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
Advertisement
Advertisement
Advertisement


