హైదరాబాద్: 28°C
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ విజయం

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. భార్తీ (56*), మంధాన (39) రాణించడంతో 179/8 స్కోరు చేసింది. ఛేదనలో విండీస్ 153 పరుగులకే పరిమితమైంది. శ్రేయాంక నాలుగు, రాధా మూడు వికెట్లతో చెలరేగారు. భారత్ తన తదుపరి వార్మప్ మ్యాచ్ జూన్ 10న ఇంగ్లాండ్‌తో ఆడనుంది.