హైదరాబాద్: 28°C
క్రైమ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి

TG: రంగారెడ్డి జిల్లా నందిగామ బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బైకును కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు బీహార్ కార్మికులు రోషన్ కుమార్, పంకజ్‌లుగా గుర్తించారు. పాలిప్యాక్ పరిశ్రమలో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన కార్మికులు మరణించారు. విధులు ముగించుకుని షాద్‌నగర్ నుంచి నందిగామ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.