HYD: ఖైరతాబాద్ బడా గణేష్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఆదివారం తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఖైరతాబాద్లోని పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకుని హారతి ఇచ్చారు. పూజల అనంతరం వారిని ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
తెలంగాణ
VIDEO: బడా గణేష్ను దర్శించుకున్న మాజీ మంత్రి


