హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌కూ కేసీఆర్‌ గతే పడుతుంది: ఎంపీ

MDK: రాష్ట్రంలో కుర్చీలు, జెండాలు మారినా పాలకుల ప్రవర్తన మారలేదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. KCR, రేవంత్‌రెడ్డిలు MIMతో చేతులు కలిపి నిజాం నవాబును పొగుడుతున్నారని ఆరోపించారు. నిజాం రాజు తరతరాల బూజు అన్న దాశరథి మాటల ప్రకారం కేసీఆర్‌ను ప్రజలు సాగనంపారని నిజాం బాటలో నడుస్తున్న రేవంత్‌రెడ్డికి కూడా త్వరలోనే అదే గతి పడుతుందని హెచ్చరించారు.