హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ ఢీకొని ట్రాక్టర్ బోల్తా

KDP: ఒంటిమిట్టలో లారీ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. కడప నుంచి రాజంపేటకు గోడ నిర్మాణ సిమెంట్‌ అచ్చులు తరలిస్తున్న ట్రాక్టర్‌ను సీతారాముల కల్యాణ వేదిక సమీపంలో బళ్లారి నుంచి చెన్నై వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ శివారెడ్డి గాయపడ్డారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.