E.G: నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీ శివారులో శనివారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుడు సాయి సహకారంతో 108 వాహనంలో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


