హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులను ఆకట్టుకున్న గరిక విగ్నేశ్వరుడు

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం బండారులంకలో గరిక గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా శనివారం సాయంత్రం లక్ష దుర్వార్చన పూజ జరిపించారు. దీంతో స్వామివారు గరిక గణపతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పూజలు చేసి దర్శించుకోగా, అనంతరం ప్రసాద వితరణ చేశారు.