హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు రాజోలు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ ఆదివారం సఖినేటిపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సఖినేటిపల్లిలంకలో నిర్మించిన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు మాజీ ఎంపీటీసీ దివంగత పడాల సత్యనారాయణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. తర్వాత గ్రామంలోని సమస్యలపై స్థానికులతో చర్చిస్తారని అధికారులు తెలిపారు.