హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

KMR: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం బీర్కూరులో రైస్ మిల్లర్లు తహసీల్దార్ సవాయిసింగ్‌కు వినతి పత్రం అందజేశారు. CMR ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఆర్థిక, సాంకేతిక నిర్వాహణపరమైన తదితర ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ కాస్ట్ సీటు ప్రకారం వెంటనే డబ్బులు చెల్లించాలని అధికారులు తమను ఒత్తిడి చేయవద్దని మిల్లర్లు కోరారు.