GNTR: మంగళగిరిలో మహిళల ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టీ20 పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. నాలుగు జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 13మ్యాచ్లు జరగనున్నాయి. తొలి మ్యాచ్కు ఎమ్మెల్యే గళ్లా మాధవి టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు లీగ్ ఉపయోగపడుతుందన్నారు. అన్ని మ్యాచ్లు ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ టీ20 పోటీలు ప్రారంభం


