NTR: గంపలగూడెం మండలం పెనుగొలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శనివారం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు తాపీ ధర్మారావు, బోయి భీమన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను పాల్గొని ఇరువురి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సామాజిక అసమానతలు, ప్రజా సమస్యలపై తమ రచనల ద్వారా ప్రజలను ఆలోచింపజేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా బోయి భీమన్న జయంతి వేడుకలు


