హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరులో స్వచ్ఛభారత్‌–స్వచ్ఛాంధ్ర

CTR: చిత్తూరులో శనివారం స్వచ్ఛభారత్‌–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ మొక్కలు నాటి, రోడ్లను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చూడా ఛైర్‌పర్సన్‌ కటారి హేమలత, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.