విశాఖ మధురవాడలోని శ్రీగాయత్రి విద్యానిలయంలో విషాదకర ఘటన జరిగింది. స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. మెట్లపై నుంచి కింద పడిపోవడంతో సదరు బాలికకు గాయాలయ్యాయని పాఠశాల సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మెట్లపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు


