HYD: మాదాపూర్లో ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. రోజ్గార్ మేళాతో దేశంలో ఉద్యోగ విప్లవం కొనసాగుతోందని, ఇప్పటివరకు 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. 'వికసిత భారత్-2047' సాధనలో ఈ యువత పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు.
తెలంగాణ
రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్రమంత్రి


