హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆగి ఉన్న పాఠశాల బస్సును ఢీకొన్న ద్విచక్ర వాహనం

KMR: ఆగి ఉన్న ప్రైవేటు పాఠశాల బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మహమ్మద్ నగర్ మండలం గిర్నితాండాలోని హై వేపై శనివారం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు ప్రధాన రహదారిపై విద్యార్థులను బస్సులోకి ఎక్కించుకునే సమయంలో నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన ఇద్దరు ద్విచక్ర వాహనం వెళుతూ బస్సును ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరికి కాలు విరగగా, మరొకరు స్పల్పగాయాలు అయ్యాయి.