KRNL: కౌతాళం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే.మల్లయ్య డిమాండ్ చేశారు. ఇవాళ పలు గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, 2024 క్రాప్ ఇన్సూరెన్స్ నగదు జమ చేయాలని, పశుగ్రాసం, కరువు పింఛన్లు అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'కౌతాళంను కరువు మండలంగా ప్రకటించాలి'


