NDL: డోన్లో ఎంపీ శబరికి ఏపీ జర్నలిస్టుల పరిరక్షణ సమితి ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. కరోనా సమయంలో రద్దైన జర్నలిస్టుల రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలన్నారు. జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్లు, ఇళ్ల స్థలాలు, సహజ మరణ బీమా సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రద్దైన రైళ్లను పునరుద్ధరించి, డోన్లో ప్రయాణికుల రైల్వే సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలి'


