హైదరాబాద్: 28°C
క్రీడలు

ఒలింపియాడ్‌లో భారత హ్యాట్రిక్ విజయాలు

చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లు హ్యాట్రిక్ విజయాలు దక్కించుకున్నాయి. మూడో రౌండ్లో మహిళల జట్టు 3.5-0.5తో గ్రీస్‌ను ఓడించింది. కోనేరు హంపి, సవిత, వంతిక అగర్వాల్ గెలుపొందారు. అవ్రామిడోతో గేమ్‌ను దివ్య దేశ్‌ముఖ్ డ్రా చేసుకుంది. అలాగే, ఓపెన్ విభాగంలో పురుషుల జట్టు 3-1తో ఇటలీని ఓడించింది. నిహాల్‌ సరీన్, దొమ్మరాజు గుకేశ్‌ విజయం సాధించారు.