హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

MDCL: మోతీనగర్ హౌసింగ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు అంజిరెడ్డి హఠాన్మరణం పట్ల కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంజిరెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.