సిద్దిపేట జిల్లా జైలును డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఖైదీలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. వంటగది, స్టోరూమ్, మరుగుదొడ్లను పరిశీలించి, భోజన వసతులపై జైలు సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. ప్రతివారం జైలును సందర్శిస్తామని తెలిపారు.
తెలంగాణ
జిల్లా జైలును సందర్శించిన డీఎల్ఎస్ఏ కార్యదర్శి


