హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లపై అధికారుల సమీక్ష

RR: ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ వనస్థలిపురంలోని ఉమెన్స్ థీమ్ పార్క్, గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన పోర్టబుల్ పాండ్‌ను పరిశీలించారు. హయత్‌నగర్ సర్కిల్ డీసీతో కలిసి పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.