హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'

అన్నమయ్య: తలపుల సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీజీఆర్‌ఎస్ ఫిర్యాదులను సకాలంలో, నాణ్యతతో పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉంచకూడదని ఆదేశించారు. పెన్షన్ల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి, అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.