బాపట్ల రెడ్ క్రాస్ భవన్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఉప్పుటూరు ప్రభుత్వహోమియో డాక్టర్ దాసరి చంద్రశేఖర్ పరీక్షలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. హోమియోపతితో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హోమియో వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు హోమియో వైద్య సేవలు


