హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తిపాడులో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

GNTR: ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులు శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురు ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వినతులను స్వీకరించి పరిశీలించారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన వాటికి సూచనలు చేశారు. మరికొన్ని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.