హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీచ్‌ను సందర్శించిన ఎస్‌డీపీవో

AKP: వినాయక విగ్రహాల నిమజ్జన నేపథ్యంలో వాడపాలెం బీచ్‌ను పరవాడ ఎస్‌డీపీవో మోహన్‌రావు గురువారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. రాంబిల్లి సీఐ, ఎస్సై ఆయన వెంట ఉన్నారు. భక్తులు సముద్రంలోకి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి, నిర్దేశిత ప్రదేశాల్లోనే నిమజ్జనం జరిగేలా చూడాలని సూచించారు. గజ ఈతగాళ్లు, రక్షణ బృందాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.