హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ డీలర్లతో సీఎస్ డిటీ సమావేశం

ATP: గుత్తి మండల కేంద్రంలోని రేషన్ డీలర్లు డీడీలు సకాలంలో చెల్లించాలని సీఎస్ డిటి సురేఖ సూచించారు. శుక్రవారం రేషన్ డీలర్లతో ఆమె సమావేశం అయ్యారు. ఆమె మాట్లాడుతూ.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల ఇంటి వద్దకు వెళ్లి సరుకులను అందజేయాలన్నారు. రేషన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పూర్తి చేయాలని అన్నారు.