హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం రాస్తారోకో

JN: డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల డ్రాలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ లబ్ధిదారులు రాస్తారోకో నిర్వహించారు. లింగాల గణపురం మండలం కళ్లెం అంబేడ్కర్ సెంటర్‌ వద్ద సీపీఎం గ్రామ కార్యదర్శి మబ్బు ఉప్పలయ్య ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. ఆస్తులు ఉన్న వారికి కూడా ఇళ్లు కేటాయించారని,దీనిపై విచారణ జరిపి నిజమైన పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.