W.G: తాడేపల్లిగూడెం రైల్వే రేక్ పాయింట్కు గురువారం క్రిబ్కో కంపెనీకి చెందిన 350 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయిందని ఇన్చార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు నారాయణ రావు తెలిపారు. తాడేపల్లిగూడెం పరిధిలోని గోదాముల్లో ఈ ఎరువులను నిల్వ చేయనున్నట్లు వివరించారు. రాబోయే రబీ సీజన్ కు అవసరాన్ని బట్టి ఎరువులను వినియోగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెంకు 350 మెట్రిక్ టన్నుల యూరియా


