హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుకు నేడే చివరి అవకాశం

E.G: ఎన్టీఆర్ భరోసా పథకంలో కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో ఇప్పటివరకు 52,574 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 18 శుక్రవారం చివరి అవకాశమని స్పష్టం చేశారు. ఇప్పటికే గడువును రెండు రోజులు పెంచామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.