హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్‌ మండపాన్ని పరిశీలించిన ఏసీపీ

KMM: పెనుబల్లి మండలం వీఎం బంజరలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపాన్ని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్‌ గురువారం పరిశీలించారు. వినాయకుడిని దర్శించుకుని నిర్వాహకులతో మాట్లాడారు. ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనం తేదీ, ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.