హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మద్యం దుకాణాల రెన్యూవల్ తప్పనిసరి'

KDP: ఏడాది పూర్తయిన మద్యం దుకాణాలను తప్పనిసరిగా రెన్యూవల్ చేసుకోవాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. గురువారం సిద్ధవటంలో ఒంటిమిట్ట, సిద్ధవటం, అట్లూరు మండలాల దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఎక్సైజ్‌ స్టేషన్‌ తరలింపుపై ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ రాజశేఖర్, ఎస్సై నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.