హైదరాబాద్: 28°C
తెలంగాణ

అపాయింట్‌మెంట్ పేరుతో భారీ మోసం

WGL: వరంగల్ నగరంలోని లేబర్ కాలోనిలో డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో నంబర్‌కు ఫోన్ చేసిన లేబర్‌కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి సైబర్ మోసానికి గురయ్యాడు. రూ.5 చెల్లించి యాప్ ఇన్‌స్టాల్ చేసి క్లిక్ చేయడంతో బ్యాంకు ఖాతా నుంచి రూ.3,99,091 మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో బుధవారం మిల్స్‌కాలనీ పోలీసులు కేసు నమోదు చేశారు.